18 May, 2026 | 1:01 PM

Districts - Jogulamba Gadwal

article_48434395.webp
జోగులాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు..

గద్వాల టౌన్: జోగులాంబ గద్వాల జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల మండల పరిధిలోని జమ్మిచేడు, ములకలపల్లి గ్రామ శివారుల్లో అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలు బహిరంగంగానే కొనసాగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున నల్లమట్టి, ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పట్టపగలే యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పలు అనుమానాలకు తావిస్తోందని ప్రజలు బహిరంగానే విమర్శిస్తున్నారు.

14-05-2026